హైదరాబాద్ విమానాశ్రయంలో రూ. కోటి విలువైన అక్రమ బంగారం సీజ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తీసుకొస్తున్న సుమారు రెండు కిలోలకు పైగా బంగారాన్ని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
దుబాయ్ హైదరాబాద్కు వచ్చిన ఓ విమానంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు విమానం ఎయిర్ పోర్టుకు చేరుకోగానే తనిఖీలు చేపట్టారు.

ఓ సీటు కింద లైఫ్ జాకెట్లో దాచిన 2.3 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సీటులో ప్రయాణికుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇక మరో ప్రయాణికుడి నుంచి కూడా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కువైట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ప్రయాణికుడు తీసుకొస్తున్న 160 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడికి నోటీసులు జారీ చేసి పంపించారు. కాగా, ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications