తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: మాస్కులు ధరించాలంటూ ఆరోగ్యశాఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం 26,704 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా భారీ నుంచి గత 24 గంటల్లో 145 మంది కోలుకున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
గత వారంతో పోలిస్తే ఈరోజు రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది.
వాటిలో కొన్ని.. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు అత్యవసరమైతేనే బయటకు రావాలి. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత 24 గంటల్లో కేసులు కాస్త తక్కువగా వెలుగు చూశాయి. గత కొన్ిన రోజులుగా 12వేలకుపైగా నమోదైన కొత్త కేసులు.. ఇవాళ మాత్రం 10వేల దిగువకు చేరాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 79వేలకుపైకి ఎగబాకాయి.