Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారం రోజుల్లో కేసీఆర్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సు: ఖరీదు రూ. 5 కోట్లు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు అత్యాధునిక వసతులతో కూడిన బుల్లెట్ ప్రూఫ్‌తో తయారైన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. చంఢీగడ్‌కు చెందిన జేసీబీఎల్ కంపెనీ రెండు బస్సులకు తుది మెరుగులు దిద్దుతోంది.

ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల తయారీకి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ. 5 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. కేసీఆర్ కోసం రూపొందుతున్న బస్సు రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు కోసం రూపొందుతున్న బస్సు వచ్చేందుకు మరి కాస్తంత సమయం పడుతుందని సమాచారం.

ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వారి యొక్క జిల్లాల పర్యటనలను ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. సీఎంలతో పాటు వారి వ్యక్తిగత భద్రత సిబ్బంది, అధికారులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సుల్లో 17 నుంచి 20 వరకు అత్యాధునిక సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ బస్సుల్లో ప్రయాణిస్తూనే చంద్రబాబు, కేసీఆర్‌లు తమ రాష్ట్రాల పాలనా వ్వవహారాలను కూడా చక్కబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెలివిజన్లతో పాటు శాటిలైట్ లాంటి సౌకర్యాలు కూడా వీటిలో ఏర్పాటు కానున్నాయి.

హైదరాబాద్

బుల్లెట్ ప్రూఫ్ బస్సు ప్రత్యేకతలు:

* బుల్లెట్లకు దెబ్బతినదు.

* అగ్ని నుంచి రక్షణ ఇస్తుంది.

* పెద్ద పద్ద బ్లాస్టింగ్‌లను తట్టుకుంటుంది.

* అత్యాధునిక సౌకర్యాలు

* బాత్ రూమ్ తరహాలో ఏర్పాట్లు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+