తెలంగాణాలో కొత్తగా 684 కరోనా కేసులు .. 5 వేలకు చేరువగా యాక్టివ్ కేసులు
భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి . తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షలలో 56,122 మందికి పరీక్షలు చేయగా వారిలో 684 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
కరోనా మరణ మృదంగం .. తాజాగా 354 మంది మృతులు, కేసుల్లో టాప్ 10 నగరాలివే
గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి
వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు . దీంతో కరోనా మహమ్మారి తో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1697 కు చేరింది. కరోనా బారిన పడిన వారిలో నిన్న 394 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,965 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 1873 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇక జిహెచ్ఎంసి పరిధిలో నిన్న ఒక్కరోజే 184 కరోనా కేసులు నమోదయ్యాయి .
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 3,07,889 కరోనా కేసులు
ఇదిలా
ఉంటే
ఇప్పటివరకు
తెలంగాణ
రాష్ట్రంలో
మొత్తంగా
3,07,889
కరోనా
కేసులు
నమోదు
కాగా,
రాష్ట్రంలో
ఇప్పటివరకు
కరోనా
నుండి
కోలుకున్న
వారు
3,01
,227
మంది.
ప్రస్తుతం
భారతదేశంలో
ఉన్న
1.3
శాతం
మరణాల
రేటు
లో
తెలంగాణ
రాష్ట్రంలో
నమోదవుతున్న
మరణాల
రేటు
0.55
శాతం.
ఇక
కోలుకున్న
వారి
రేటు
భారతదేశంలో
90
4.1
శాతంగా
ఉండగా
తెలంగాణ
రాష్ట్రంలో
97.83
శాతంగా
నమోదైనట్టు
ఆరోగ్య
శాఖ
చెప్తుంది
.
కరోనా నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలని తెలంగాణా సర్కార్ ఆదేశం
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించి గుండా బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని అటు పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.