హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో పెరిగిన కరోనా కొత్త కేసులు: తగ్గిన రికవరీ, జిల్లాలవారీగా కేసులివే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, గత 24 గంటల్లో నమోదైన కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,15,237 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 749 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు, 5 మరణాలు

తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు, 5 మరణాలు

తాజాగా, నమోదైన 749 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,33,895కు చేరింది. కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3743కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 10,203కి పెరిగిన యాక్టివ్ కేసులు

తెలంగాణలో 10,203కి పెరిగిన యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 605 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,19,949కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,203 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.79 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 36, జీహెచ్ఎంసీలో 72. జగిత్యాలలో 18, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 15, జోగులాంబ గద్వాలలో 04, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 58, ఖమ్మంలో 96, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 08, మహబూబాబాద్‌లో 18, మంచిర్యాలలో 43, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 28, ములుగులో 11, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 54, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 11, పెద్దపల్లిలో 41, రాజన్న సిరిసిల్లలో 21, రంగారెడ్డిలో 32, సంగారెడ్డిలో 12, సిద్దిపేటలో 22, సూర్యాపేటలో 34, వికారాబాద్ లో 05, వనపర్తిలో 07, వరంగల్ రూరల్ లో 09, వరంగల్ అర్బన్‌లో 55, యాదాద్రి భువనగిరిలో 16 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

English summary
749 new corona cases, 5 deaths reported in telangana state, in last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X