అంతులేని అరాచకాలు: రూ.40వేలకు పెళ్లి పేరుతో అమ్మాయి అమ్మకం
నిఖా (పెళ్లి) పేరుతో వంచించడానికి వచ్చిన ఇద్దరు దుబాయ్ సోదరులతోపాటు ఇద్దరు స్థానిక వ్యక్తుల్ని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
హైదరాబాద్: పాతనగరంలో అరబ్షేక్ల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి పేరుతో వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇటీవలే ఓ యువతిని రూ.5లక్షలకు కొనుగోలు చేసి పెళ్లి పేరుతో ఓ ఒమన్ షేక్ అక్కడికి తీసుకెళ్లిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి అమ్మాయిల్ని నిఖా (పెళ్లి) పేరుతో వంచించడానికి వచ్చిన ఇద్దరు దుబాయ్ సోదరులతోపాటు ఇద్దరు స్థానిక వ్యక్తుల్ని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
శంషాబాద్ డీసీపీ పద్మజ, మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ ఈ సంఘటన గురించి న వివరాలను మీడియాకు తెలిపారు. దుబాయ్కు చెందిన సలీం ఒబేద్ (52) పాతకార్ల వ్యాపారి. ఆగస్టు 10న హైదరాబాద్కు వచ్చిన ఇతడు పెళ్లిళ్ల బ్రోకర్ షఫీని సంప్రదించాడు. అందమైన అమ్మాయితో నిఖా జరిపిస్తే రూ.70 వేలు ఇస్తానన్నాడు. దీంతో అతడు మైలార్దేవుపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిఖాకు ఒప్పించాడు.

షేక్ ఇచ్చిన సొమ్ములో రూ. 40 వేలు వారికిచ్చి రూ. 30 వేలు తాను తీసుకున్నాడు షఫీ. కాగా, నిఖాను స్థానిక హాజీతోనే జరిపించాల్సి ఉన్నా.. అతడిని కాదని తనకు నమ్మకస్థుడైన మరొకరిని పిలిపించి ఆరు రోజుల క్రితం నిఖా జరిపించాడు. కోరిక తీర్చుకుని దుబాయ్కు పారిపోయే ఉద్దేశంతోనే సలీం ఒబేద్ ఇలా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
నిఖా ధ్రువీకరణ పత్రాన్ని ఆమోదం కోసం ముంబై పంపించినట్లు బాధిత కుటుంబాన్ని నమ్మించారు. ఈ ఆరురోజులు బాధితురాలితో గడిపిన షేక్ దుబాయ్ పారిపోయేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. సలీం లాగే అతడి తమ్ముడు ఇబ్రహీం ఒబేద్ (48) కూడా హైదరాబాద్ బాట పట్టి బ్రోకర్ షఫీని ఫోన్లో సంప్రదించాడు.
తనకు బాలికల్ని మాత్రమే చూపించాలని కోరాడు. గత మంగళవారం ఇబ్రహీం రాజేంద్రనగర్కు వచ్చాడు. షఫీ తన వద్ద ఉన్న బాలికల చిత్రాల్ని చూపించడంతో ఓ బాలికను ఎంచుకున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం రాత్రి నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
కాగా నిందితుల వద్ద పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలుఉండటం గమనార్హం. నిందితులు ఇప్పటికే ఇద్దరు యువతులను విదేశాలకు పంపారని, అక్కడ తమను హింసిస్తున్నారని వెంటనే తమను హైదరాబాద్ తీసుకురావాలని షఫీకి ఫోన్ చేసి బాధిత యువతులు వేడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications