ప్రియురాలితో పెళ్లి చేయాలని.. సెల్ టవర్ ఎక్కాడు
వరంగల్: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్లో చోటుచేసుకుంది. యువకుడు గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కినట్లు తెలిసింది.
ఒకవేళ ఎవరైనా బలవంతంగా తనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తే టవర్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు బెదిరింపులకు గురిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మధిరలో ఇద్దరు కొడుకులతో సహా తండ్రి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి తన ఇద్దరు కొడుకులతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
మృతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లి వాసులుగా సమాచారం. మృతులు వెంకటరమణ, అశ్రుద్(10), అవిజ్ఞ(7)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications