భార్యను గొంతుకోసి, ఉరేసుకొన్నాడు, ఎందుకిలా..
కుటుంబ కలహల నేపథ్యంలో భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన సోమవారం రాత్రి హైద్రాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :హైద్రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, భర్తలు చనిపోయారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్నాడు నిందితుడు.
కుటుంబ గొడవలతో విసిగిపోయిన భార్య, భర్తలు అర్థాంతరంగా తమ ప్రాణాలను కోల్పోయారు. హైద్రాబాద్ లోన మల్కాజిగిరిపోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఆనంద్ బాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా కృష్ణయ్య పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు.
సోమవారం రాత్రి పూట కృష్ణయ్య తన భార్య లక్ష్మిని కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అయితే కుటుంబ కలహల కారణంగానే కృష్ణయ్య ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోది.
అయితే భార్యను గొంతుకోసి హత్య చేసిన తర్వాత అపార్ట్ మెంట్ లోని సెల్ టవర్ కు ఉరివేసుకొని ఆయన కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. మల్కాజిగిరి పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications