మహిళలు ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చీరల పండుగ..చీర కావాలంటే ఇలా చెయ్యండి!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడత గ్రామీణ ప్రాంతాలలో ఆ తర్వాత రెండవ విడతలో పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తారు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేలా అట్టహాసంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో ప్రతి నియోజకవర్గంలోనూ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు చీరల పంపకం
ఈ చీరల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కోసం పెన్షనర్ల ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం వినియోగిస్తున్న యాప్ ను వినియోగిస్తున్నారు. అందులో మహిళా సంఘాల సభ్యుల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి చీరలను అందిస్తున్నారు. అంతేకాదు చీరలను తీసుకుంటున్న ఫోటోలను కూడా అందులో పొందుపరచాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ఈ చీరల పంపకం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చాలని భావిస్తున్న ప్రభుత్వం పారదర్శకంగా చీరలపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించింది.

మహిళాసభ్యులు కానివారికి కూడా చీరల పంపిణీ
ఇందిరమ్మ చీరలు పొందడానికి మహిళల వయసు 18సంవత్సరాలు నిండి ఉండాలని, ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకుని చీరలను ఇస్తారని పేర్కొంది. ఇక ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నదనే విషయాన్ని ప్రజలందరికి తెలియజేయాలని భావిస్తోంది. అయితే మహిళాసభ్యులకు మాత్రమే ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన క్రమంలో, మహిళాసభ్యులు కానివారికి కూడా చీరలను పంపిణీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఆడబిడ్డలందరికీ చీరలు
ఎవరైతే మహిళా సంఘాలలో సభ్యులు కారో వారికి కూడా చీరలు ఇవ్వాలంటే వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత వారికి చీరలను అందజేస్తారు. ప్రతి మండలంలో సబ్ కలెక్టర్, ఆర్డీవోలు ఇందిరమ్మ చీరలపంపిణీ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు చీరలను అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం ఆడబిడ్డలు అందరికీ సారెను అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
చీరలు కావాలంటే ఇది తప్పనిసరి
అన్ని జిల్లాలలో, మండల కేంద్రాలలో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతలవారీగా పంపిణీని పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాలలో కొనసాగే ఈ కార్యక్రమం, పట్టణ ప్రాంతాల మహిళలకు మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా ఆధార్ కార్డు తోనే అందరికీ చీరలను ఇవ్వనున్నారు. అయితే చీరలు కావాలంటే మహిళా సంఘాల సభ్యులు కావడం అనేది తప్పనిసరి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications