Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉపాధ్యాయుడి అవయవాలతో ముగ్గురికి జీవనదానం

వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.

ఖమ్మం: జిల్లాలోని వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. ఫిబ్రవరి 17 తలపోటుతో స్పృహ కోల్పోయారు.

ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మొదడు నుంచి స్పందనలు లేకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్ళాలని సూచించారు. అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.

A teacher donates his organs to three people after brain death

గుండె కొట్టుకుంటుండటంతో రెండు మూత్రపిండాలు, కాలేయం ఇతరులకు అమర్చవచ్చని వైద్యులు చెప్పగా.. కుటుంబ సభ్యులు అంగీకరించి తెలంగాణ జీవన్‌దాన్‌కు సమాచారం అందించారు.

ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం మల్లికార్జునరావు శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం సేకరించి నగరంలోని వేరే ఆసుపత్రుల్లో అత్యవసరం ఉన్న వారికి వాటిని అమర్చారు. దీంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+