టికెట్ అడిగినందుకు రైల్వే టీసీపై ఇద్దరు యువకుల దాడి
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్పై దాడికి పాల్పడ్డారు.
వరంగల్: రైలులో టికెట్ కలెక్టర్పై దాడి జరిగింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపారు. కిరణ్ కుమార్ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్-1 బోగీలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీ కిరణ్ కుమార్పై దాడికి పాల్పడ్డారు. దీంతో టీసీకి గాయాలయ్యాయి.

రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం.. టీసీ కిరణ్ కుమార్ ను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన రవితేజ, సుమన్ పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications