అరుణాచలానికి వెళ్తూ.. రక్తమోడిన జడ్చర్ల జాతీయ రహదారి
Road accident: మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం రాత్రి జడ్చర్ల సమీపంలో ఈ ఘటన సంభవించింది. జైభారత్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి బయలుదేరింది. మార్గమధ్యలో జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. జడ్చర్ల వద్ద సింధూర బార్ అండ్ రెస్టారెంట్ ఓ కారును తప్పించే క్రమంలో అదుపు తప్పింది.

టైర్ పంక్చర్ కావడం వల్ల రోడ్డు పక్కన నిలిపివుంచిన ఓ కారును తప్పించబోయిన బస్సు డ్రైవర్ అదుపు తప్పి ఎదురుగా వెళ్తోన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు, బస్సు క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులకు గాయలయ్యాయి.

బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఢీ కొట్టిన తరువాత లారీ బోల్తా పడిందంటే బస్సు వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకుంట వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications