ఓ భార్య ఘాతుకం ... తాగొచ్చి తిడుతున్నాడని భర్త మర్మావయవాలు కోసేసింది
ఓ భార్య కసాయిగా మారింది. భర్త వేధింపులు తాళలేక ఎవరు చేయని పని చేసింది. తాగి ఇంటికి వచ్చి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాడని ఏకంగా భర్త మర్మావయవాలను కోసి పారేసింది . హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన నగరవాసులను షాక్ కు గురి చేసింది.

విచక్షణ రహితంగా భర్త మర్మావయవాలను కోసిన ఉదంతంలో అసలేం జరిగిందంటే రాజస్థాన్ కి చెందిన షేర్ సింగ్(26), సంతోషిని(24) లు దంపతులు. వీరికి నాలుగేళ్లలోపు వయసుగల ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాజస్థాన్ నుండి వలస వచ్చిన వారు పది రోజుల క్రితం హైదరాబాదులో మకాం పెట్టారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. షేర్ సింగ్.. ఎల్బీనగర్ లోని ఓ మార్బుల్స్ కంపెనీలో పనికి కుదిరాడు.సంతోషిని ఇంట్లో పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా పని చేసి ఇంటికి వచ్చిన షేర్ సింగ్ రాత్రి సమయంలో మద్యం సేవించి గొడవ పడ్డాడు. ఆ మద్యం మత్తులో ఏవో చిన్న కారణాలు చెప్పి భార్యను తిట్టడం మొదలుపెట్టాడు. చిన్న విషయానికి ఇంత రాద్దాంతం చేయడాన్ని తట్టుకోలేక పోయిన సంతోషిణి అంతే కోపంతో కిచెన్ లో కూరగాయాలు కోసే కత్తితో భర్తపై దాడి చేసింది.అతని మర్మాంగాలను కత్తితో కోసేసింది.
భార్య చేసిన పనికి ప్రాణాపాయస్థితికి చేరుకొని షాక్ కు గురైన భర్త తిరిగి కాస్త కోలుకొని చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి సమయంలో చిన్నారులు నిద్రలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఇంతటి ఘాతుకానికి పాల్పడిన షేర్ సింగ్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.
తాగొచ్చి మద్యం మత్తులో భర్త తిడితేనే మర్మావయవాలు కోసేసింది అంటే ఇక పొరపాటున చెయ్యి చేసుకుంటే పైకి పంపించేది కావచ్చు అని ఈ విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆడవాళ్ళల్లో కూడా ఇలాంటి క్రూరత్వం నిండిన వాళ్ళు ఉంటారా అని ఈ సంఘటన గురించి విన్న స్థానికులు గుసగుసలాడుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications