ఢిల్లీలో తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం: ఆ ఎమ్మెల్యే వేధింపులే కారణం?
న్యూఢిల్లీ: తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్ డెయిర్ సీఈవో బోడపాటి శేజల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
శేజల్ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆరోపించింది.రెండ్రోజుల క్రితం ఢిల్లీలోని మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) ని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని... తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని శేజల్ తెలిపారు.
ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. కానీ ఇవ్వడం లేదంటూ శేజల్ తెలిపారు. తనలాగే ఎంతోమంది బాధితులున్నారని శేజల్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే పెద్ద ఉమనైజర్ అని.. తన దగ్గర అన్ని ఆధారాలన్నాయని.. వాటిని భద్రంగా ఉంచామని తెలిపారు.
తెలంగాణ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని బాధితురాలు శేజల్ తెలిపారు.కాగా, తాజాగా, శుక్రవారం ఆమె బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోవైపు తన ఆత్మహత్యపై శేజల్ లేఖ రాసింది.
లేఖలో ఏముందంటే..?
'గౌరవనీయులైన న్యాయమూర్తులకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు, మీడియా మిత్రులకు నా విన్నపం..
నన్ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరియు వారి అనుచరులైన భీమాగౌడ్, చిల్లరపు సతీష్, కుమ్మరి పోచన్న, కొనంకి కార్తీక్ లు కొంత కాలంగా మానసికంగా రకరకాలుగా హింసిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నన్ను వేధిస్తూ వాళ్ల అనుచరులతో చంపుతానని బెదిరిస్తుండటంతో నేను ఢిల్లీకి వచ్చి నిరసన తెలియజేస్తుండగా.. గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో నా ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ నా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. గోలి శివ మరియు ఇంకో వ్యక్తి నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.
నేను పలుమార్లు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసులను నమోదు చేయకపోగా తప్పుడు కేసులు నా మీద పెడుతూ నన్ను చిత్ర హింసకు గురిచేస్తున్నారు.విజ్ఞప్తి : నేను చనిపోయిన తర్వాత అయినా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ..నేను ఈ సూసైడ్ లెటర్ రాస్తున్నాను..' అంటూ శేజల్ లేఖ పేర్కొనడం గమనార్హం.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications