Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో ఘోరం: యువతిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు పైనుంచి దూసుకెళ్లడంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడ చౌరస్తాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం తెలుస్తోంది. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ప్రయాణికులు ఒక్కొక్కరుగా రోడ్డు దాటుతున్నారు. అందరిలానే ఆ యువతి కూడా రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సును ఆమె గమనించలేదు.

A young woman died after being hit by an RTC bus in Hyderabad

చివరకు చేయి పైకెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేలోపే ఆమెపై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ యువతి బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ముందున్న యువతిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆమె పైనుంచి బస్సును తీసుకెళ్లడంతోనే ఈ ఘోరం జరిగింది.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడున్నవారు వారించినా వినకుండా దూకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు కొందరు వీడియో తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌​లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్​మెంట్‌​లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి దూకవద్దంటూ కేకలు వేశారు. వారు తెరుకునే లోపు ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది.

వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు సమాచారం. కాగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఎవరితో ఏం మాట్లాడింది అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+