అభయ్ హత్య కేసులో పురోగతి: బీహారీ డ్రైవర్ కీలక పాత్ర?
హైదరాబాద్: పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యాపారి రాజ్కుమార్ కుమారుడు అభయ్ని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అభయ్ కిడ్నాప్, హత్య సంఘటలో బీహారీ వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన శేషుతో పాటు బీహార్కు చెందిన లల్లన్ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లల్లన్ తివారీ బీహార్కు చెందినవాడు.

తివారీ ఏడాదిన్నర కాలంగా రాజ్కుమార్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అభయ్ని కిడ్నాప్ చేసిన తర్వాత తివారీ సాయికి సమాచారం అందిస్తూ వచ్చాడని పోలీసులు గుర్తించారు. రాజ్కుమార్, పోలీసుల కదలికలను సాయికి తివారీ అందిస్తూ వచ్చాడని అంటున్నారు.
అభయ్ని హత్య చేసిన తర్వాత నిందితులు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్కుమార్కు ఫోన్ చేసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడిన విషయం తెలిసిందే. పది కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్ ఆ తర్వాత ఐదు కోట్ల రూపాయలకు దిగి వచ్చాడు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications