ఏసీబీ వలలో భారీ తిమింగలం: ఎంపీవో ఇంటిపై ఏసీబీ దాడుల్లో దిమ్మతిరిగే ఆస్తులు
తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు, సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు. శంషాబాద్ మండల పంచాయతీ అధికారి, అవినీతి తిమింగలం సురేందర్ రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు 20 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు.

మండల పంచాయతీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు.. కేసు నమోదు
మండల పంచాయతీ అధికారిపై ఏసీబీ చేసిన రైడ్ లో భారీగా బంగారం నగదుతో పాటు, ఖరీదైన విల్లాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలను తనిఖీలలో గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డి పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇక సురేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో సురేందర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది.

అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ .. విధుల్లో చేరే సమయానికి ఏసీబీ దాడులు
రెండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పంచాయతీ అధికారి గా ఉన్న సమయంలో విధులు సక్రమంగా నిర్వహించే లేదన్న ఆరోపణలు సురేందర్ రెడ్డి పై వచ్చాయి. అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడంతో, డి పి వో విచారణ జరిపి సురేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఇటీవల సురేందర్ రెడ్డి పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయటంతో సంగారెడ్డి మండలంలో ఎంపీడీవోగా చేరడానికి ఆయన రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా జరిగిన ఏసీబీ దాడులలో అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఎంపీడీవో సురేందర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల పై వివరాలను వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం రావడంతో తాము దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సమాచారంతోనే తాము రైడ్ చేశామని పేర్కొన్నారు.

20 కోట్లకు పైబడి విలువైన ఆస్తుల సీజ్
సురేందర్ రెడ్డి ఆస్తులపై దాడులు లో భాగంగా భారీ ఎత్తున బంగారం నగదు విలువైన ఆస్తి పత్రాలతో పాటు ఇప్పటి వరకు దాదాపు 2, 31, 63,000 సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్లకు పైబడి ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీ అధికారుల నిఘా ఉంటుందని తెలిపి, ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications