హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ మంత్రి ఇంటికి నటి రజని, స్కూల్‌పై ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Actor Rajini complaints to T Minister on International School
హైదరాబాద్: దూలపల్లి సమీపంలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన నిర్వహించడం లేదని ప్రముఖ సినీ నటి రజని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి ఆమె వినతి పత్రం ఇచ్చారు. తన పిల్లలను మానసికంగా హింసిస్తున్నారని, దీని పైన విచారణ జరిపించాలని కోరారు.

కాగా, దూలపల్లి సమీపంలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఆ పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపిస్తూ రజని పది రోజుల క్రితం బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆమె ఫిర్యాదు ప్రకారం తన పెద్ద కుమారుడు అజయ్ ఇదే స్కూలులో పదో తరగతి చదువుతున్నాడని, స్కూలు వారి మానసిక వేధింపులు తాళలేక మానివేశాడన్నారు. 7వ తరగతి చదువుతున్న కూతురు రికితను అక్టోబర్ 28న తరగతి టీచర్ అకారణంగా చెంప దెబ్బలు కొట్టారని ఆరోపించారు.

ఈ విషయమై అదే రోజు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే పాఠశాలలో 5వ తరగతి చదవుతున్న తన చిన్న కుమారుడు ధనుష్ అక్టోబర్ 31న బస్సులో అటు ఇటూ తిరుగుతున్నాడని ఇంగ్లీష్ టీచర్ వేధించారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా పాఠశాల యాజమాన్యం తన పిల్లల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.

English summary

 Actor Rajini complaints to Telangana Minister Jagadeeswar Reddy on International School.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X