బీజేపీలోకి దివ్యవాణీ - ముహూర్తం ఫిక్స్..!!
సినీ నటి దివ్యవాణీ రాజకీయంగా మరోపార్టీలో చేరిక ఖాయమైంది. టీడీపీలో పని చేసి రాజీనామా చేసిన దివ్యవాణీ ఇప్పుడు బీజేపీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. తెలంగాణ లో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దివ్య వాణీ సమావేశమయ్యారు. పార్టీలో చేరిక పైన చర్చించారు. అయితే, పార్టీలో ఏ రకంగా దివ్య వాణీ సేవలు వినియోగించుకోవాలనే అంశంతో పాటుగా పార్టీలో బాధ్యతల పైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజేందర్ స్పష్టం చేసారు.
దివ్యవాణీ తమిళ - కన్నడ ప్రాంతాలతోనూ సంబంధాలు ఉండటంతో.. పార్టీ ప్రచారానికి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతోందని.. త్వరలోనే తాను పార్టీలో చేరే అంశం పైన అన్నీ చెబుతానని దివ్యవాణీ చెప్పుకొచ్చారు. అయితే, ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
శామీర్ పెట్ నివాసం లో ఈటల రాజేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సినీ నటి దివ్య వాణి..!!#DivyaVani #EtelaRajender #Telangana #TSNews #Oneindiatelugu pic.twitter.com/h6qljkECz6
— oneindiatelugu (@oneindiatelugu) September 8, 2022
ఆయన సమక్షంలో కొందరు పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దివ్యవాణీ సైతం కాషాయం కండువా కప్పుకొనే ఛాన్స్ ఉందని సమాచారం. టీడీపీలో పని చేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా దివ్యవాణీ అనేక ఆరోపణలు..విమర్శలు చేసారు.

అయితే, మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం పైన దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన సమయంలోనూ తన ఆవేదన వినేందుకు సమయం ఇవ్వలేదని వాపోయారు. పార్టీలో కొందరు నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన దివ్య వాణీ..టీడీపీకి రాజీనామా చేసారు. ఆ తరువాత బీజేపీలో చేరికకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. త్వరలోనే బండి సంజయ్ తోనూ దివ్య వాణీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో దివ్య వాణీ పార్టీలో చేరిక ముహూర్తం ఫైనల్ అవుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications