కేసీఆర్ థర్డ్ ఫ్రంట్కు చత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి మద్దతు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్కు చత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కేసీఆర్కు ఫోన్ చేశారు.

కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తే తాను అందులో భాగస్వామిని అవుతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపారన్నారు. భావసారూప్యత ఉన్న జాతీయస్థాయి నేతలతో సంప్రదింపులు జరిపి ఫ్రంట్ ఏర్పాటులో తనదైన పాత్ర పోషిస్తానని చెప్పారు. అజిత్ జోగి చత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ నేత.
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ యోచనకు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ తదితరులు మద్దతు పలికారు. ఇప్పుడు చత్తీస్గఢ్ మాజీ సీఎం మద్దతు ఇచ్చారు.












Click it and Unblock the Notifications