లక్కీ ఛాన్స్: అక్కినేని అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం
హైదరాబాద్: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్వతహాగా జంతువులంటే అమలకు ఎంతో ప్రాణం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అమల బ్లూ క్రాస్ తరుపున జంతు సంరక్షణ కోసం కృష్టి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ బోర్డులో అక్కినేని భార్య అమలకు స్థానం దక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చైర్మన్ గా నియమించిన ఈ బోర్డులో అక్కినేని అమలను సభ్యురాలిగా తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మొత్తం 21 మందితో జంతు సంరక్షణ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కాగా అక్కినేని అమల గత కొన్నాళ్లుగా సినిమాలుగా దూరంగా ఉంటున్నారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఈ చిత్రంలో నటనకు గాను ఆమె బెస్ట్ సపోర్టింగ్ రోల్ విభాగంలో ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.