కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధం.. నేటి నుంచే !!
తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ "నాగోబా జాతర"కు సర్వం సిద్ధమైంది. గిరిజనుల అత్యంత పవిత్రమైన ఈ జాతరను పుష్యమాస అమావాస్య సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జరిగే మహాపూజలతో నాగోబా జాతర అధికారికంగా ప్రారంభం కానుంది.
ఈ పవిత్ర ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే అంకురార్పణ కార్యక్రమం సందర్భంగా.. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన పవిత్ర గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. అనంతరం ఏడు రకాల నైవేద్యాలు సమర్పించి జాతర ఆరంభ ఘట్టాన్ని పూర్తిచేస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఆదివాసీలు కేస్లాపూర్కు తరలివస్తారు.

జాతరలో భాగంగా ఈ నెల 20న మెస్రం వంశీయులు ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇతరులకు ఆలయంలో ప్రవేశం పూర్తిగా నిషేధం ఉంటుంది. అదే రోజు పురుషులు మాత్రమే పాల్గొనే పెర్సపేన్ పూజలు, అలాగే మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే భాన్ దేవత పూజలు జరుగుతాయి. ఇవి గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి.
ఈ నెల 22న మంత్రులు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమ సమస్యలు, అవసరాలు, సంక్షేమ పథకాలపై సూచనలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది నాగోబా జాతరలో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా భావిస్తారు.
తదుపరి రోజు 23న భేతల్ పూజలు, మండ గాజిలింగ్ కార్యక్రమాలతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. అయితే పూజలు ముగిసినా, నాగోబా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.
జాతర నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును భారీగా పెంచారు. అలాగే అటవీ ప్రాంతం కావడంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
నాగోబా జాతర గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే మహోత్సవంగా నిలుస్తోంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగ గిరిజనుల ఐక్యతకు, వారి విశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనంగా భావించబడుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications