టిలో అమెజాన్ స్టోర్: కెటిఆర్ను కలిసిన ప్రతినిధులు
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఈ కామర్స్ సేవలందిస్తున్న అమెజాన్ సంస్థ త్వరలో తెలంగాణలో కొత్త స్టోర్(గిడ్డండి)ని నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, అమెజాన్ సంస్థకు మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
బుధవారం నగరానికి వచ్చిన అమెజాన్ సంస్థ ప్రతినిధులు ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావును సచివాలయంలో కలిశారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో వేర్హౌస్ నిర్మాణానికి ప్రభుత్వానికి, అమెజాన్ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దక్షణాది రాష్ట్రాల కస్టమర్లకు తమ ఉత్పత్తులను అందించనుంది.
అమెజాన్ గిడ్డంగిని నిర్మించాలనుకోవడం సంతోషకరం: కెసిఆర్
తెలంగాణలో అమెజాన్ సంస్థ అతిపెద్ద గిడ్డంగిని నిర్మించాలనుకోవడం సంతోషకరంగా ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక బిల్లును అసెంబ్లీలో పాస్ చేశామని గుర్తు చేశారు.
నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్రంలో కంపెనీలు భారీగా ఏర్పాటు అవుతున్నాయని సీఎం తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో 2 లక్షల 80 వేల స్కేర్ ఫీట్లలో అమెజాన్ సంస్థ వేర్హౌస్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.