కర్ణాటకలోనూ, తెలంగాణాలోనూ అధికారం మాదే: అమిత్ షా ధీమా!!
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. బిజెపి నుండి కీలక నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో అమీతుమీ తేల్చుకోవటానికి కర్ణాటకలోని రాజకీయ పార్టీలన్నీ రెడీ అయ్యాయి. కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తనదైన శైలిలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక తాజాగా అమిత్ షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో కర్ణాటక రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి మెజారిటీ సాధిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన అమిత్ షా, డబల్ ఇంజిన్ ప్రభుత్వంపై కర్ణాటక ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో సైతం పూర్తి మెజారిటీతో గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందని పేర్కొన్న ఆయన కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా పర్యటన సాగనుంది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న అనంతరం రేపు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.
అమిత్ షా పర్యటనలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా బృందంలోని ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. ఆపై పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి, చేవెళ్ల లో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేపట్టనున్నారు. అమిత్ షా పర్యటనను, బహిరంగ సభను సక్సెస్ చెయ్యాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిస్తున్నారు. తెలంగాణా పర్యటనతో అమిత్ షా తెలంగాణాలోనూ ఎన్నికలకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications