బిల్స్ గేట్స్తో చంద్రబాబు భేటీ.. ఈసారి ‘ఏఐ’
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. తాజాగా, ఆయన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్గేట్స్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్గేట్స్కు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. దక్షిణ భారత్లో గేట్స్ పౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని మంత్రి లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మీ అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్గేట్స్కి తెలిపారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టంని నిర్వహించేందుకు ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరఫున నైపుణ్య సహకారం అందిచాలని బిల్ గేట్స్కు విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ.. చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం 2025లో ఏఐ కోసం బిల్గేట్స్తో భేటీ అయ్యామని చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్గేట్స్ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.
Hon'ble Chief Minister, Shri @ncbn, met with Mr @BillGates at the @wef Annual Meeting in Davos today. They discussed opportunities to collaborate on health, AI, and innovation to drive progress in Andhra Pradesh. @BMGFIndia #InvestInAP pic.twitter.com/S2otaIn0it
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 22, 2025
ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజూ పెట్టుబడుల వేట కొనసాగించారు. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల ప్రతనిధులతో సమావేశమై ఏపీలోని అవకాశాల గురించి వివరించారు. గూగుల్ క్లౌడ్, పెప్సీ కో, పెట్రోనాస్ సంస్థ ప్రతినిధులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.ఏపీలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని టెమాసెక్ హోల్డింగ్స్ భారత్ ెడ్ రవి లాంబాను మంత్రి లోకేష్ కోరారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications