వాళ్లు మా వాళ్లే, నగదు ఉందనడం అవాస్తవం: తెలంగాణ ఈసీకి ఏపీ డీజీపీ వివరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో డబ్బు పంచుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఏపీ పోలీసు శాఖను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం సమాధానం ఇచ్చారు.
నోటీసులో పేర్కొన్న విధంగా తెలంగాణలో పట్టుబడిన వారు తమ ఇంటెలిజెన్స్ అధికారులేనని ఏపీ డీజీపీ తెలిపారు. అయితే, ఆ అధికారుల వద్ద నగదు ఉంనడం అవాస్తవమని అన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోల ఎక్కడా కూడా డబ్బులు కనిపించలేదని అన్నారు.

మావోయిస్టుల కదలికలపై సమాచారం కోసమే ఏపీ అధికారులు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని తెలిపారు. ఏపీకి తెలంగాణ ఇంకా ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని ఏపీ డీజీపీ తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీతో మాట్లాడిన తర్వాత సమగ్ర సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, నాలుగు రోజుల క్రితం ధర్మపురిలో ఏపీకి చెందిన ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారుల(పోలీసులు)ను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో ఏపీ డీజీపీకి తెలంగాణ ఈసీ నోటీసులు జారీ చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications