భన్వర్లాల్కు షాక్! రిటైర్ అయిన కొద్దిసేపటికే క్రమశిక్షణ చర్య, ఏపీ ప్రభుత్వం ఆదేశం
పదవీ విరమణ చేసిన ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ దినేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఎన్నికల సంఘం ప్రధాని అధికారిగా మంగళవారమే భన్వర్లాల్ పదవీ విరమణ చేశారు. కొత్త ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇన్చార్జి అనూప్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.

భన్వర్లాల్ అలా పదవీ విరమణ చేశారో లేదో ఇలా ఏపీ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించక పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వివరాల్లోకెళితే.. ప్రభుత్వ బంగ్లా దుర్వినియోగంపై గతంలో భన్వర్లాల్కు రూ. 17 లక్షల మేర ప్రభుత్వం జరిమానా విధించింది.
అయితే ఈ జరిమానాను గత ప్రభుత్వం రూ. 4,37,500 లకు కుదించింది. అయితే భన్వర్లాల్ ఆ బకాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం రూ.17 లక్షల జరిమానా చెల్లించేలా చర్యలు తీసుకోనుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications