కూటమి గెలుపు ఖాయం: గ్రేటర్లో ఏపి మంత్రుల ప్రచారం(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్ని కుట్రలు పన్నినా గ్రేటర్లో మిత్రపక్షాల(బిజెపి-టిడిపి) అభ్యర్థుల విజయం తధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే టిడిపి, బిజెపిలతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లకుంట మిత్రపక్షాల అభ్యర్థి వనం మాలతితో కలిసి మంత్రి డివిజన్లో ప్రచారం చేపట్టారు. టీఆర్టీ క్వార్టర్స్, ప్రశాంత్నగర్, కూరగాయల మార్కెట్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. వనం రమేష్ తోపాు బిజెపి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఇది ఇలా ఉండగా, టిడిపి, బిజెపి మిత్రపక్షాలకు మేయర్ పీఠం దక్కితేనే గ్రేటర్ అభివృద్ధి చెందుతుందని ఏపీ రవాణాశాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు. బిజెపి బలపరిచిన టిడిపి అభ్యర్థి గండి కృష్ణయాదవ్తో కలిసి బుధవారం నేతాజీనగర్, త్యాగరాయనగర్, మాతాలక్ష్మీనగర్ కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఎన్డీఏ, టిడిపి హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని మరో ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి బలపర్చిన టిడిపి అభ్యర్థి ఆకుల అఖిల అరవింద్కుమార్తో కలిసి హుడాకాలనీ, ఏబిసి టైప్ క్వార్టర్స్, డాక్టర్స్ కాలనీ, జేబీ కాలనీ, వెంకటేశ్వరకాలనీ రోడ్ నెంబర్ 9,11,13లలో ఇంటింటికి ప్రచారం చేశారు.
సరూర్నగర్ అభివృద్ధి చెందాలంటే టిడిపి అభ్యర్థి ఆకుల అఖిలను గెలిపించాలని ఆయన కోరారు. కాగా, మరో ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్నగర్ డివిజన్ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్నగర్ డివిజన్ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
ఎన్ని కుట్రలు పన్నినా గ్రేటర్లో మిత్రపక్షాల(బిజెపి-టిడిపి) అభ్యర్థుల విజయం తధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే టిడిపి, బిజెపిలతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లకుంట మిత్రపక్షాల అభ్యర్థి వనం మాలతితో కలిసి మంత్రి డివిజన్లో ప్రచారం చేపట్టారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
టిడిపి, బిజెపి మిత్రపక్షాలకు మేయర్ పీఠం దక్కితేనే గ్రేటర్ అభివృద్ధి చెందుతుందని ఏపీ రవాణాశాఖ మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
బిజెపి బలపరిచిన టిడిపి అభ్యర్థి గండి కృష్ణయాదవ్తో కలిసి బుధవారం నేతాజీనగర్, త్యాగరాయనగర్, మాతాలక్ష్మీనగర్ కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
ఎన్డీఏ, టిడిపి హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని మరో ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి బలపర్చిన టిడిపి అభ్యర్థి ఆకుల అఖిల అరవింద్కుమార్తో కలిసి హుడాకాలనీ, ఏబిసి టైప్ క్వార్టర్స్, డాక్టర్స్ కాలనీ, జేబీ కాలనీ, వెంకటేశ్వరకాలనీ రోడ్ నెంబర్ 9,11,13లలో ఇంటింటికి ప్రచారం చేశారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
సరూర్నగర్ అభివృద్ధి చెందాలంటే టిడిపి అభ్యర్థి ఆకుల అఖిలను గెలిపించాలని ఆయన కోరారు.
గ్రేటర్ ప్రచారంలో ఏపి మంత్రులు
మరో ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్నగర్ డివిజన్ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.