అవినీతి కేసు: తెలంగాణలో లోకాయుక్త పుత్రుడు అశ్విన్ రావ్ అరెస్టు
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడు వై. అశ్విన్ రావ్, అతని వ్యక్తిగత సహాయకుడు మనోజ్ ను అరెస్టు చేశారు.
లోకాయుక్తలో రూ. ఒక కోటి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక బృందం పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు జులై 25వ తేది లోపు విచారణకు హాజరు కావాలని అశ్విన్ రావ్ కు సూచించారు.
అయితే అశ్విన్ రావ్ విచారణకు హాజరుకాలేదు. పోలీసులు బెంగళూరుతో పాటు తెలంగాణ, చెన్నయ్ లో దర్యాప్తు చేశారు. డీసీపీ లాబూరామ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పోలీసులు తెలంగాణలో దర్యాప్తు చేసి అశ్విన్ రావ్ గురించి వివరాలు సేకరించారు.

రంగారెడ్డి జిల్లాలోని ఇంటిలో అశ్విన్ రావ్ తలదాచుకున్నాడని వెలుగు చూడటంతో అతనిని అరెస్టు చేశారు. ఆదివారం లోకాయుక్త జాయింట్ కమిషనర్ (పీఆర్ఓ) సయ్యద్ రియాజ్ ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
న్యాయస్థానం అనుమతితో సయ్యద్ రియాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అశ్విన్ రావ్, మనోజ్ లను న్యాయస్థానం ముందు హాజరుపరిచి విచారణ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications