జాబ్ మేళా పేరుతో భారీ మోసం: ఉప్పల్లో ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం
ఉద్యోగాల పేరిట దాదాపు అయిదు వేల మందిని మోసం చేసిన సంఘటన హైదరాబాదులోని ఉప్పల్లో చోటు చేసుకుంది. జరిగిన మోసం తెలిసిన నిరుద్యోగులు కాలేజీ పైన దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
హైదరాబాద్: ఉద్యోగాల పేరిట దాదాపు అయిదు వేల మందిని మోసం చేసిన సంఘటన హైదరాబాదులోని ఉప్పల్లో చోటు చేసుకుంది. జరిగిన మోసం తెలిసిన నిరుద్యోగులు కాలేజీ పైన దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
అద్వితీయ శ్రేయ ఫౌండేషన్, గెట్ మై జాబ్స్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఉప్పల్లోని ఓ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆన్ లైన్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. 40 ఎంఎన్సీ కంపెనీలు, ఇతర కంపెనీలు వస్తాయని చెప్పారు.

ఆదివారం ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. కానీ అక్కడకు చేరుకున్న నిరుద్యోగులకు షాక్ తగిలింది.
అక్కడ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. దీంతో అక్కడి యాజమాన్యాన్ని నిలదీశారు. నిరుద్యోగులు ఆగ్రహంతో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కాలేజీ యాజమాన్యం పోలీసులను సంప్రదించింది.
పోలీసులు మాట్లాడుతూ.. ఉప్పల్ జాబ్ మేలా బాధ్యుల పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చూసి నిరుద్యోగులు మోసపోవద్దని హితవు పలికారు. నిందితుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications