మండిపోతున్న ఎండలు: తెలంగాణలొ అత్యధికంగా 44.4డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మేడిపల్లిలో అత్యధికంగా 44.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతంతో పోలిస్తే హైదరాబాద్లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే మూడు రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
గతంలొ ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవలేదంటున్నారు. 45ఏళ్ల క్రితం 1973, ఏప్రిల్ 30న నమోదైన 43.3డిగ్రీల ఉష్ణోగ్రతనే ఇప్పటిదాకా హైదరాబాద్ లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. కానీ ఇప్పుడా రికార్డుకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

నగరంలోని పలుచోట్ల 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు తాజాగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అంటున్నారు. కాగా, ఎండ కారణంగా ప్రజలు కూడా మధ్యాహ్నాం పూట రోడ్ల మీదకు రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో నగరంలో ఉక్కపోత కూడా ఎక్కువైంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications