రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు; డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఎక్సైజ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. రాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న పబ్ లైసెన్స్ ను రద్దు చేసింది. హోటల్ కి సంబంధించి లిక్కర్ లైసెన్సును కూడా రద్దు చేసింది. రాడిసన్ హోటల్ లో 24 గంటలు లిక్కర్ సప్లై చేయడం కోసం అనుమతి తీసుకున్నారు. దీనికోసం 56 లక్షల రూపాయల టాక్స్ కూడా చెల్లించారు. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో పబ్ తో పాటు 24 గంటల 2బీ బార్ లైసెన్స్ ను కూడా రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఉల్లంఘించి పబ్ లు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించింది.

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో డ్రగ్స్ లభించిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు పబ్ మరియు బార్ లైసెన్స్ లను రద్దుచేశారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కేసీఆర్ ఆదేశాలతో గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా యజమానుల బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లైసెన్సు రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించినట్లు గా గుర్తు చేశారు.

అధికారులు పబ్ లు, బార్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు
యజమానులు ఎంతటి వారైనా సరే నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో అధికారులు సైతం పబ్ లు, బార్ లపై నిరంతరం దాడులు కొనసాగించాలని, ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇక డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి అన్న దానిపైన కూడా నిఘా పెట్టామని పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ఇదిలా ఉంటే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు రిపోర్ట్ కోసం పంపించారు. ఇక ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు, ఈ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.

పరారైన వారి కోసం గాలింపు.. డ్రగ్స్ వినియోగించిన వారి డేటా కూడా సేకరిస్తున్న పోలీసులు
ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. డ్రగ్స్ పబ్ లో కి ఎలా రవాణా అయ్యాయి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది? కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పబ్ మేనేజర్ అనిల్ కుమార్ కీలకంగా మారారు. అసలు సూత్రధారులతో పాటుగా, ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన వారు ఎవరు అన్నదానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధాన నిందితుడు అనిల్, అభిషేక్ లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications