కేసీఆర్ కోరికను నెరవేర్చిన కేంద్రం: మోదీకి థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
Bharat Ratna: మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
పీవీ నరసింహారావుతో పాటు మాజీ ప్రధాని, దివంగత చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న పురస్కారానికి నామినేట్ చేసినట్లు తెలిపారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరును భారతరత్న పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఇదివరకే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీలకూ ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ కే అద్వానీ మినహా మిగిలిన ముగ్గురికీ మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఇప్పటివరకు మొత్తం అయిదుమందికి భారతరత్న పురస్కారం లభించినట్టయింది.
తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అపర చాణక్యుడిగా పేరుంది. రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 జూన్ నుంచి 1996 మే వరకూ ప్రధానిగా పూర్తికాలం పని చేశారు. పీవీ.. మైనారిటీలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడపగలిగారు.
1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నాలుగో ముఖ్యమంత్రిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మంథని ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. ఎంపీగా హన్మకొండ, మహారాష్ట్రలోని రామ్టెక్ స్థానాల నుంచి రెండు సార్లు చొప్పున లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఉప ఎన్నిక ద్వారా నంద్యాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
భారతరత్న పురస్కారానికి పీవీ పేరును నామినేట్ చేయడం పట్ల భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో.. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రతిపాదనలు చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తమ విజ్ఞప్తి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications