మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. పూర్తి వివరాలు ఇవిగో..
మేడారం జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. ఈ పండుగ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. అంతేకాక మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చరిత్రలో నిలిచింది. అయితే 2026 జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది. అయితే మేడారం జాతర సందర్భంగా ముందస్తు ముక్కులు చెల్లించుకున్న భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హనుమకొండ బస్ స్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు తొలి బస్సు ప్రారంభం కానుంది. 7గంటలు, 8 గంటలు, 9 గంటలు.. అలాగే మధ్యాహ్నం 12:10 గంటలు, 1:00 గంట, 1:40, 14:30.. తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మేడారానికి బస్సులు బయల్దేరనున్నాయి. అలాగే మేడారం నుంచి తొలి బస్సు ఉదయం 5:45 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత 9:45, 10:15, 11:15, మధ్యాహ్నం 1:10, సాయంత్రం 4:00, 5:00, 5:30, 6:00 గంటలకు బస్సులను హన్మకొండకు నడిపేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలవుతున్న నేపథ్యంలో ఈ పథకంలో భాగంగా ఎక్స్ ప్రెస్ పల్లె వెలుగు బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంది. ఇక 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో ముందుగా వన దేవతలను దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే పల్లె వెలుగు ఛార్జీలు పెద్దలకైతే రూ.130, పిల్లలకు రూ.80గా నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్స్ ప్రెస్ అయితే పెద్దలకు రూ.180.. పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications