ప్రాణం తీసిన బైక్ ఫోటోగ్రఫీ: 500 మందికి హామీ ఇచ్చి, 50 మందినే తీసుకు రావడంతో..
హైదరాబాద్: యువతకు బైక్లు అంటే పిచ్చి. ఆ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఖరీదైన బైక్లను అద్దెకు ఇస్తూ ఫోటోలు తీసి ఇచ్చే బైక్ ఫోటోగ్రఫీ అనే సంస్థ విద్యార్థి వంశీకృష్ణ స్నేహం చేశాడు. ఆ బైక్లపై ఉన్న సరదా చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఈ విషాధ సంఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది.
వంశీకృష్ణ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ బైక్ ఫోటోగ్రఫీ సంస్థతో అతనికి పరిచయం ఉంది. బైక్ ఫైన ఫోటోలు దిదేందుకు 500 మందిని తీసుకు వస్తానని బైక్ ఫోటో గ్రఫీ ఈవెంట్ ఆర్గనైజర్కు చెప్పాడు. ఒక్కొక్కరి వద్ద రూ.350 తీసుకుంటామని చెప్పారు.

ఈ నెల 29వ తేదీన ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం నిర్వహించారు. వంశీతో పాటు మరికొందరు ప్రచారం చేశారు. 500 మందిని తీసుకువస్తానని చెప్పిన అతను చాలా తక్కువ మందిని తీసుకు వచ్చాడు.
అయితే వంశీ కేవలం 50 మందినే తీసుకు వచ్చాడు. దీంతో మిగతా 450 మందికి సంబంధించిన రూ.లక్షకు పైగా డబ్బు చెల్లించాలని బైక్ ఫోటో గ్రఫీ ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్పారు. వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవల్ల నష్టం జరిగిందని, అ డబ్బు ఎవరు చెల్లిస్తారని, నీవే ఇవ్వాలని చెప్పాడు.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే కష్టమని భావించిన వంశీ, అంత డబ్బు తేలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ తండ్రి చిన్న ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతనేమో చదువుకుంటున్నాడు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications