'కేసీఆర్! బహిరంగంగా మజ్లిస్తో పొత్తు కుదుర్చుకోగలవా? అప్రజాస్వామికం'
హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేయడంపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు అని అమలు కానీ హామీలతో మోసం చేశారని, దీనికి తెరాసను ఓడించాలని కిషన్ రెడ్డి అన్నారు.
మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారన్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన ప్రయివేటు వైద్య కళాశాలకు భూమి ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. మజ్లిస్ పార్టీ మీకు మిత్రపక్షమైతే బహిరంగ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు వస్తోందన్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. అయిదేళ్లు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు.
కేబినెట్ అభిప్రాయాలను కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ పూర్తి చేయలేదన్నారు. మిషన్ భగీరథ పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పారని గుర్తు చేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications