సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలి: డీకే అరుణ డిమాండ్, ఎందుకంటే?
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీగా గెలిచిన డీకే అరుణ. బుధవారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో డీకే అరుణ మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరండం అని 14 సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని.. అది ఏమైందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోడీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని.. మహబూబ్నగర్లో ఓడిపోయినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అభ్యర్థిలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు.

మోడీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని డీకే అరుణ తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహాపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. 10 సీట్లు వస్తాయని అంచనా వేశాం.. కానీ, 8 సీట్లకు పరిమితమయ్యామని డీకే అరుణ తెలిపారు. అయోధ్య ఉండే ఫైజాబాద్లో బీజేపీ ఓటమికి స్థానిక కారణాలు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు
కేంద్రమంత్రి పదవిపై డీకే అరుణ ఏమన్నారంటే?
లోక్సభ ఎన్నికల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి మోడీ అభివృద్ధి నినాదం వెళ్లిందన్నారు డీకే అరుణ. బీజేపీని అడ్డుకోవడం కోసం రిజర్వేషన్లు తీసివేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక, తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పని చేస్తానన్నారు. కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని డీకే అరుణ స్పష్టం చేశారు. జూన్ 7వ తేదీన ఎంపీలమంతా ఢిల్లీకి వెళుతున్నామని, 8న ప్రధాని ప్రమాణ స్వీకారం ఉంటుందని డీకే అరుణ తెలిపారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పారు.
-
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications