2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా: డీకే అరుణ, తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లంటే?
మహబూబ్నగర్:లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారన్నారు మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. దేశం కోసం, ధర్మ కోసం అంటూ ఏకపక్షంగా ఓటర్లు బీజేపీకి ఓటేశారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అన్నారు. మహబూబ్నగర్లో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలను చాలా మంది బెదిరించారని డీకే అరుణ ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదని , ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటర్లు ఓటేశారని తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని చెప్పారు.

మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో విజయం బీజేపీదేనని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడ్డారన్నారు.నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని పార్టీలకు అతీతంగా చాలా మంది ఓటేశారని డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో 2-3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి 8 సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసినా.. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీవైపే నిలిచారని డీకే అరుణ తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. యువతోపాటు అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా నిలిచారన్నారు. తెలంగాణలో బీజేపీకి 12 స్థానాల్లో విజయం సాధించబోతోందని డీకే అరుణ స్పష్టం చేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications