సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగివున్న బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందంటూ బుధవారం రాత్రి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు. అయితే, ఫోన్ కాల్ వచ్చిన సమయంలో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఆగివుంది.
దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్, గోపాలపురం పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది రైలులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు లభించలేదని తెలిసింది. మరోవైపు, ఈ బాంబు బెదిరింపు కాల్ ఆకతాయిల పనేనని పోలీసులు ఆ తర్వాత తేల్చారు.

కాగా, ఇటీవల ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిపోయాయి. రెండు మూడు రోజుల క్రితం ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఓ ప్రయాణికుడు ఆలస్యం కావడంతో ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేయడం గమనార్హం. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications