కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగిన మత్తులో వదినపై లైంగిక దాడికి యత్నం: ఆపై హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తాగిన మత్తులో వదినపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోగా గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని చింతకాని గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

చెరాల రాజమ్మ(48) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెం దాడు. దీంతో కూలి చేసుకుంటూ రాజమ్మ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న రాజమ్మపై మరిది చెరాల పోశయ్య కన్నేశాడు. ఎలాగైనా లోబర్చుకోవాలని మద్యం మత్తులో శనివారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లి లైంగికదాడికి యత్నించాడు.

Murder

పోశయ్యను ప్రతిఘటించేందుకు రాజమ్మ ప్రయత్నించే క్రమం లో తోపులాట జరిగింది. దీంతో రాజమ్మ తలను పోశయ్య నేలకేసి కొట్టి, గొంతు నులిమాడు. రాజమ్మ ఇంట్లోంచి కేకలు వినిపించడంతో చుట్ట పక్కల వారు రాగా, అప్పటికే చనిపోయింది. స్థానికు లు, సర్పంచ్ మందల లకా్ష్మరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని కాటారం సీఐ గడ్డం సదన్ కుమార్, ఎస్‌ఐ పర్శ రమేశ్ పరిశీలించి వివరాలు సేకరించారు.

ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహదేవపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజమ్మ కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడు చెరాల పోశయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలికి వివాహామైన కూతురు ఉంది.

మహిళ ఆత్మహత్య

కరీంనగర్ ధర్మపురి మండలం లోని తిమ్మాపూర్ గ్రామా నికి చెందిన ఆడెపు వర లక్ష్మి(40) అప్పుల బాధ తో ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుంది. వరలక్ష్మికి ఇద్దరు కూతుళ్లున్నారు. భర్త జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అప్పుల బాధ అధికంగా ఉండడంతో తట్టుకోలేక వరలక్ష్మి ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man attempted to sexually assault against his sister-in-law in Karimanagar district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X