అదానీ రగడ: పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు
బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు.
న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు కూడా బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు తిరస్కరించారు. దీంతో నిరసన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతోనే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీలు సురేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బీబీ పాటిల్ సహా ఇతర ఎంపీలు నిరసన తెలిపారు. అదానీ వ్యవహారంపై జేపీసీ లేదంటే సీజేఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.
అదానీ - హిండెన్ బర్గ్ అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉభయ సభల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. మోదీ - అదానీల కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని నినాదాలు చేస్తూ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. pic.twitter.com/Vfyo6GdVUy
— BRS Party (@BRSparty) February 8, 2023
మరోవైపు, కాంగ్రెస్, టీఎంసీ సహా పార్టీలు కూడా అదానీ వ్యవహారంపై చర్చ జరగాలని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా అదానీ వ్యవహారంపై కేంద్రాన్ని నిందించారు. అదానీ.. మోడీ స్నేహితుడని.. అందుకే అన్ని కాంట్రాక్టులు ఆ సంస్థకే వెళుతున్నాయని ఆరోపించారు.

కాగా, ఇటీవలమహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించిన బహిరంగ సభ, మీడియా సమావేశాల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. అదానీ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంతో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అదానీకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications