కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి: పార్టీ మార్పు ఖాయమేనా?
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంతటితో ఆగకుండా మరికొంతమంది నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీ నేతలు తిరిగి రావాలని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, దామోదర్ రెడ్డి అటు అధికారిక పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటుండటం గమనార్హం.

ఇటీవల గద్వాలలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సభకు కూడా దామోదర్ హాజరయ్యారు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా బాధితులకు అందజేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో దామోదర్ రెడ్డి ఆ పార్టీలో చేరతారన్న ప్రచారానికి బలం చేకూర్చింది. దామోదర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.
దామోదర్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం వస్తుందని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వంపై ధీమాగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉండటం కనిపించింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాగా, ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో చేరికపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, మల్లు రవితో భేటీ అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత తన తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. నాగంతో తత్సంబంధాలే ఉన్నాయని.. అయితే, కొన్ని ఇబ్బందుల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని దామోదర్ రెడ్డి తెలిపారు.
తాను కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లు పనిచేశానని దామోదర్ రెడ్డి తెలిపారు. తిరిగి సొంతగూటికి వస్తే ఎలా ఉంటుందని మల్లు రవితో చర్చించగా.. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ క్యాడర్తో తనకు కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ మార్పుపై తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు దామోదర్ రెడ్డి. ఇక, దామోదర్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం స్పందించాల్సి ఉంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications