ఆ ఒపీనియన్ పోల్ బోగస్: కేటీఆర్ కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార ఉధృతి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో అమీ తుమీ తేల్చుకుంటోన్నాయి. భారత్ రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు తెలంగాణలో మకాం వేశారు.
అదే సమయంలో సోషల్ మీడియా వేదికలపై ఎన్నికల సర్వేలు, ఒపీనియర్ పోల్స్.. ఇబ్బడి ముబ్బడిగా పోస్ట్ అవుతున్నాయి. విభిన్న అంచనాలను వ్యక్తం చేస్తోన్నాయి. కొన్ని సర్వే సంస్థలు.. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోండగా.. మరికొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో- రాజ్నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాభిప్రాయాలతో రూపొందించిన రిపోర్ట్ అది. మొత్తంగా 38,351 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఈ నివేదికను తయారు చేసింది.
భారత్ రాష్ట్ర సమితి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రాజ్నీతి ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడింది. బీఆర్ఎస్కు 75 స్థానాలు లభిస్తాయని తెలిపింది. 42.43 శాతం ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. కాంగ్రెస్కు 31 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. 32. 62 శాతం వరకు ఓట్లు పడొచ్చని రాజ్నీతి అంచనా వేసింది.
బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ.. అబద్ధాలను నిజంగా చిత్రీకరిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ట్విట్టర్ టిల్లు డ్రామా రావును ట్విట్టర్ ను బ్యాన్ చేయాలి pic.twitter.com/NQmoRNWnnp
— Telangana Congress (@INCTelangana) November 24, 2023
ఈ సర్వే రిపోర్ట్ను రాజ్నీతి సంస్థ తోసిపుచ్చింది. ఇది తాము చేసిన సర్వే/ఒపీనియన్ పోల్ కాదని వివరించింది. ఈ మేరకు ఓ వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ను తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్లో విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాము ఎలాంటి సర్వేలు చేయలేదని స్పష్టం చేసింది. ఈ సర్వేను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
రాజ్నీతి సంస్థ పేరు మీద వచ్చిన ఈ సర్వే పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఏ సంస్థ అయినా నిజంగా సర్వే చేసివుంటే దాన్ని అధికారికంగా మీడియాకు విడుదల చేస్తుందని, తమ సంస్థ తరఫున అలాంటివేమీ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు రాజ్నీతి పేరును ఇలాంటి బోగస్ సర్వేల కోసం వాడుకుంటోన్నారని అన్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications