వందకు పైగా కార్ల చోరీ, వంశీ పట్టివేత: కళ్లలో కారం చల్లి దోపిడీ
హైదరాబాద్: పెద్ద యెత్తున కార్ల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ర్టాలో 100కు పైగా కార్లను ఈ ముఠా దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 కార్లను రికవరీ చేసిన పోలీసులు గ్యాంగ్ లీడర్ వంశీతో పాటు మరో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తన చోరీలకు వంశీ చిన్న పిల్లలను వాడుకుంటున్నట్లు సమాచరాం.
ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మండలం కంది గ్రామ సమీపంలో దారి దోపిడి జరిగింది. కారును అడ్డగించిన దుండగులు డ్రైవర్ ఇషాక్ కళ్లల్లో కారం చల్లారు. అనంతరం కారులో ఉన్న పత్తి వ్యాపారులను బెదిరించిన ముగ్గురు దొంగలు రూ. 50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
పత్తి వ్యాపారులు హైదరాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుమతి సందర్శించారు.

బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండలం అల్లిపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చోరీకి యత్నం జరిగింది. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు లాకర్ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. బ్యాంకు వద్ద చప్పుడు రావడంతో గ్రామస్తులు మేలుకుని అరిచారు. దీంతో దొంగలు పరారయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాయికల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ వీసాలతో పట్టుబడిన ముగ్గురు
నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ముగ్గురిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదర్బాషా, కడప, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఓ మహిళ, మరోవ్యక్తి దుబాయ్ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఇమ్మిగ్రేషన్లో అధికారులు వీరి వీసాలను తనిఖీ చేసి నకిలీగా గుర్తించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications