ఓటుకు నోటు: 'తెలంగాణ ఎసిబి వేధిస్తోంది', నివేదిక ఇవ్వమని హెచ్చార్సీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్ సిన్హా మంగళవారం నాడు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తనను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు వేధిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పైన హెచ్చార్సీ స్పందించింది. ఈ నెల 13వ తేదీ లోపు తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎసిబి అధికారులను ఆదేశించింది.
కాగా, ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయ్ సిన్హా సోమవారం నాడు న్యాయస్థానంలో కూడా ఎసిబి అధికారుల పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కేసులో రాజకీయ నేతలకు ప్రమేయముందని చెప్పమని ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని, తన పైన ఒత్తిడి తెస్తున్నారని ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఉదయ్ సిన్హా జడ్జికి ఫిర్యాదు చేశారు.
విచారణ పేరిట తనను వేధింపులకు గురి చేసిన ఏసీబీ అధికారులు, తాము చెప్పినట్లు వినాలని కూడా బెదిరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారుల వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని జడ్జిని కోరారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications