తెలంగాణాకు కేంద్రం వరాలు.. నాలుగు నేషనల్ హైవే ప్రాజెక్ట్ లకు ముహూర్తం ఖరారు!
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రభుత్వం దేశ ప్రగతికి రవాణా సౌకర్యాలు కీలక భూమిక పోషిస్తాయి అనే విషయాన్ని గుర్తించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రం వరాలను ఇచ్చింది.
నాలుగు నేషనల్ హైవేలు
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులను బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 271 కిలోమీటర్ల మేర నాలుగు భారీ ప్రాజెక్టులు నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు 10,034 కోట్లు.

మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్ ఎన్ హెచ్167
ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టి, రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం చేసి, రాష్ట్రం యొక్క ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి దోహదం చేయనుంది.ఇక కేంద్రం త్వరలో ప్రారంభించనున్న ఆ నాలుగు ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే ఎన్ హెచ్167. మహబూబ్నగర్ నుంచి గూడెబల్లూర్. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన ఈ 80కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించడానికి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఆర్మూరు జగిత్యాల, జగిత్యాల కరీంనగర్ నేషనల్ హైవేలు
ఎన్ హెచ్ 63 అండ్ ఎన్ హెచ్ 563.. ఆర్మూరు జగిత్యాల నేషనల్ హైవే. ఈ సెక్షన్ లోని జాతీయ రహదారి విస్తరణ పనులు చేయడానికి కేంద్రం సంకల్పించి టెండర్లను ఆహ్వానించింది. ఇక మరొక నేషనల్ హైవే ప్రాజెక్ట్ జగిత్యాల కరీంనగర్ ఎన్ హెచ్ 563, 58 . 60 కిలోమీటర్ల ఈ మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ హైవే నిర్మాణం టెండర్లను ఆహ్వానిస్తున్న దశలో ఉంది.
జగిత్యాల మంచిర్యాల నేషనల్ హైవే
ఎన్ హెచ్ 63 జగిత్యాల మంచిర్యాల.. 66.295 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. దీనికోసం కూడా ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులను 2026 ఫిబ్రవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంతోపాటు ఆ ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి.
-
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! లెక్కలతో సహా..! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications