నీటి రగడ: సీఎంలతో భేటీపై కసరత్తు, 19న వస్తానని, బాబు, 21న కలుద్దామని కేసీఆర్

హైదరాబాద్: కృష్ణా నది పైన ప్రాజెక్టుల నిర్మాణానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులతో ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది.

జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఈ నెల 11, 18, 19 తేదీల్లో సమావేశం కోసం మీ వెసులుబాటును తెలపాలని ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీకి మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం 21వ తేదీన ఈ సమావేశం నిర్వహించాలని కోరినట్లుగా సమాచారం. నీటి ప్రాజెక్టుల పైన ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం పైన సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.

Chandrababu Naidu - KCR

కాగా, నీటి సంక్షోభం దుప్షలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు అని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం ఆయన నీరు-ప్రగతిపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. నీటి కోసం ఘర్షణలకు దారి తీయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదనే నీరు-ప్రగతికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+