3 లక్షల కోట్లు దాటిన తెలంగాణ అప్పులు: మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం వివరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అప్పులు వివరాలను తెలియజేసింది. తెలంగాణపై అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరించింది.
2018లో రూ. లక్షా 60వేల 696.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ. 3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్, రంజిత్ రెరెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికర్ధిశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గతమూడేళ్లుగా అప్పుల శాతం
పెరుగుతూ పోతోం దని కేంద్రం పేర్కొం ది.
2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వా త భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికర్ధిశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వెల్లడించింది.

తెలంగాణలో మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం
తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుల రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్. హైదరాబాద్ మెట్రో కారిడార్ పేజ్-2 కింద తెలంగాణ సర్కారు మెట్రో ప్రాజెక్టును మొదలుపెడుతోందని చెప్పారు. ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎంఎంటీఎస్ స్టేషన్లను కూడా కలుపుతోందన్నారు.
ఇక వరంగల్ నియో మెట్రో కింద 15.5 కిలోమీటర్లకు రూ. 998 కోట్లతో ప్రపోజల్ వచ్చిందని తెలిపారు. కేంద్రమంత్రిత్వ శాఖ సూచించిన మార్పులతో మరోసారి ప్రపోజల్ పంపాలని సూచించామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు సంబంధించి ఎలాంటి ప్రపోజల్స్ రాలేదని వెల్లడించారు. కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును విస్తరించే పనులను ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications