కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కాంగ్రెస్ పార్టీకి ఈసీ నోటీసులు
బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషిస్తున్నారని బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్కు సీఈవో వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది.

బీఆర్ఎస్ ఫిర్యాదు ఆధారంగా సీఈవో వికాస్ రాజ్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదును సీఈవో కార్యాలయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వివరణ రాకపోతే, ఏమీ చెప్పేది లేదని భావించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈవో వికాస్ రాజ్ తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ నేత క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఓయూ సర్క్యులర్ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో ఇటీవలే ఓయూ పోలీసులు క్రిశాంక్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనకు కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
ఈ కేసు ఏమిటంటే?
ప్రతి ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మెస్లు మూసివేతపై సర్క్యులర్ జారీ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా.. వాటిపై సోషల్ మీడియాలో తప్పుడు దుష్ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్, నాగేందర్లను అదుపులోకి తీసుకున్నారు. మే 1న హైదరాబాద్ నుంచి కొత్తగూడానికి వీరిద్దరు వెళుతుండగా పంతంగి టోల్ప్లాజా వద్ద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ పట్టణ పోలీసులు స్థానిక ష్టేషన్ కు తీసుకెళ్లారు. తర్వాత ఓయూ పోలీస్స్టేషన్ సిబ్బందికి క్రిశాంక్ను అప్పగించారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రిశాంక్కు బెయిల్ లభించింది.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications