చెస్ట్ ఆస్పత్రి ఘటన బాధాకరం, సాయం చేసేందుకు సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
చెస్ట్ ఆస్పత్రిలో రోగి చనిపోయిన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వెంటిలేటర్ తీసేశారని రోగి సెల్ఫీ తీసి తండ్రికి వీడియో పంపించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలైంది. తనకు ఊపిరి ఆడటం లేదు అని రోగి అనడం బాధాకరమని ఆయన అన్నారు. ఘటనపై ప్రభుత్వ చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు.
కరోనా వైరస్ మెట్రో నగరాల విజృంభిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అంగీకరించారు. హైదరాబాద్ సహా చెన్నై, ముంబైలోనై కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వైరస్ వ్యాప్తికి గల కారణాలను కేంద్రబృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలో టీమ్.. గాంధీ ఆస్పత్రి, టిమ్స్, ఒక కంటైన్మైంట్ జోన్లలో పర్యటిస్తున్నారని వివరించారు.

కరోనా వైరస్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేసేందుకు కేంద్రమంత్రిగా తనవంతుగా ప్రయత్నం చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా రాష్ట్రానికి హెల్ప్ చేసేందుకు ముందుంటానని తెలిపారు. మెడికల్ సెంటర్గా ఉన్న హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications